ENGLISH | TELUGU  

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ భారీ మల్టీస్టారర్ 'బడే మియా చోటే మియా' ఏప్రిల్ 11న విడుదల

on Apr 9, 2024

పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం 'బడే మియా చోటే మియా'. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రాబోతోంది. బడే మియా చోటే మియా చిత్రం కోసం ఇప్పటికే యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నారు. మానుషి చిల్లర్, అలయ ఎఫ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

'బడే మియా చోటే మియా' ఇద్దరూ మీ హృదయాల్ని కొల్లగొట్టడమే కాదు.. సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే మూమెంట్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఇది కేవలం చిత్రం కాదు.. రోలర్ కోస్టర్ రైడ్ లాగా థ్రిల్లింగ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ అందించే విజువల్ వండర్ అని చిత్ర బృందం చెబుతోంది.

పూజా ఎంటర్టైన్మెంట్స్, ఏఏజెడ్ ఫిలిమ్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందింది. అలీ అబ్బాస్ జాఫర్ రచన దర్శకత్వం వహించారు. వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మించారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్స్ లోకి హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్,  మానుషీ చిల్లర్, ఆలయ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రల్లో నటించారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.